Theenmaar24x7

Spread the love
  • తిరుపతి రుయాలో అంబులెన్స్ డ్రైవర్ల దారుణం 
  • 20 వేల డిమాండ్, టూవీలర్ పై డెడ్ బాడీ తరలింపు

తిరుపతి: స్థానిక రుయా ఆసుపత్రి  దగ్గర దారుణం జరిగింది.  ఆస్పత్రిలో  చికిత్స తీసుకుంటూ  ఓ బాలుడు ఇవాళ ఉదయం  చనిపోయాడు. బాలుడి  మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు  బంధువులు అంబులెన్స్  మాట్లాడి రుయాకు పంపారు.  ఐతే ఆ అంబులెన్సును  రుయా హాస్పిటల్  దగ్గరున్న కొంతమంది  అంబులెన్స్ డ్రైవర్లు  అడ్డుకున్నారు. తమ అంబులెన్స్ లోనే  మృతదేహాన్ని తీసుకెళ్లాలని  పట్టుబడ్డారు. చేసేదేమీలేక  బంధువులు పంపిన  ఆంబులెన్స్ వెనక్కి  వెళ్లిపోయింది. లోకల్  అంబులెన్స్ కోసం  20వేలు డిమాండ్ చేశారు.  

అంత డబ్బు  ఇచ్చుకోలేని బాలుడి తండ్రి… డెడ్ బాడీని  టూవీలర్ పై  సొంతూరు అన్నమయ్య  జిల్లా  చిట్వేలుకు తీసుకెళ్లారు.  రుయా నుంచి చిట్వేలు దాదాపు  90 కిలోమీటర్లు.  బాలుడి మృతదేహాన్ని  తీసుకెళ్లడానికి  అంబులెన్స్  సిబ్బంది  వ్యవహరించిన తీరు దారుణమని  స్థానికులు ఆరోపిస్తున్నారు.  మరోవైపు  ఉచితంగా మృతదేహాలను  తీసుకెళ్లే.. సర్కార్ మార్చురీ  వ్యాన్ మూలనపడటంతోనే  ఇలాంటి పరిస్థితులు  ఎదురవుతున్నాయని  బాధితులు ఆరోపిస్తున్నారు. 

Subscribe to our newsletter for exclusive updates and exciting news delivered straight to your inbox. Don't miss out, sign up now!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× WhatsApp Us
×