Theenmaar24x7

Spread the love

ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టారో  చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. 2014ఎన్నికల మానిఫెస్టోలోని హామీల్లో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు, దళితులకు మూడెకరాలు భూమి ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. దళిత సీఎం హామీ ఏమైందని సంజయ్ ప్రశ్నించారు. 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు మీ ఆస్తులు ఎన్ని..ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ జమానా..అవినీతి ఖజానా అని తెలంగాణ ప్రజలు ఘోషిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి 21ఏళ్లు పూర్తైన సందర్భంగా తాను అడిగే 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు .

Subscribe to our newsletter for exclusive updates and exciting news delivered straight to your inbox. Don't miss out, sign up now!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× WhatsApp Us
×